హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): కోహెడ సమగ్ర మారెట్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, ఈ ఏడాది డిసెంబర్ 9 నుంచి రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. సోమవారం కోహెడ మార్కెట్ పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం బాటసింగారం మారెట్లో కొనసాగుతున్న లావాదేవీలను కోహెడ సమగ్ర మారెట్కు తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.