హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరంపై పదేపదే మాట్లాడే సీఎం రేవంత్రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా పరిశీలించాలని, తాము కూడా మీతో కలిసి వస్తామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ సూచించారు. ఈ ప్రాజెక్టులో 10 శాతం పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, నాలుగైదు నెలల్లో పూర్తి చేయవచ్చని తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి పాలమూరు నీళ్లిచ్చిన ఘనత తమదే అని చెప్పుకోండంటూ సూ చించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొడంగల్కు జూరాల ఎత్తిపోతల నుంచి నీటి తరలింపుపై పునరాలోచన చేయాలని పేర్కొన్నారు. కర్ణాటక కొత్త ఎత్తిపోతల పథకాలను ప్రా రంభిస్తే జూరాలకు నీరందే పరిస్థితి ఉండదని తెలిపారు. సీఎం హోదాలో రేవంత్రెడ్డి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని సూచించారు. కాంగ్రె స్ ప్రభుత్వానికి ముసళ్ల పండగ ముందే ఉన్నదని చెప్పారు.
పాలమూరు ఉమ్మడి ఏపీ పాలనలో బా గుందా, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధి జరిగిందా చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో అభివృద్ధి జరుగలేదని, కేసీఆర్ పాలమూరు ఎంపీగా ఉండబట్టే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. కల్వకుర్తి ద్వారా 6.50 లక్షల ఎకరాలకు తమ ప్రభుత్వంలోనే నీరు అందించామని తెలిపారు. సీఎం అయినందుకు రేవంత్రెడ్డి పాలమూ రు జిల్లాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కేసీఆర్ ఒక ఓటమిపై ఇన్ని అభాండాలా అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి పొత్తు అవసరం లేదని, బీజేపీ నేతలకే అలాంటి ఆలోచన ఏమైనా ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, అంజనేయగౌడ్, తుంగ బాలు పాల్గొన్నారు.