హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీలో చేరిన వైఎస్సార్టీపీ మాజీ నేత పచ్చిపాల వేణుయాదవ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్కు మద్దతివ్వాలన్న షర్మిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి పదవికి, ఆ పార్టీకి వేణుయాదవ్ బుధవారం రాజీనామా చేశారు. గురువారం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్లకురుమలకు గొర్రెలను పంపిణీ చేస్తూ, గ్రామీణ కులవృత్తులను సీఎం కేసీఆర్ పరిరక్షిస్తున్నారని కొనియాడారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో వైఎస్సార్ విగ్రహాలను ఇక్కడి కాంగ్రెస్ నాయకులే కూల్చి, తగులబెట్టారని గుర్తుచేశారు. అందుకే వైఎస్సార్ అభిమానిగా కాంగ్రెస్కు మద్దతివ్వలేక బయటికి వచ్చానన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు కాపాడుకుంటారని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యీ తకెళ్లపల్లి రవీందర్రావు నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరినట్టు వేణుయాదవ్ చెప్పారు.