వేములవాడ, మే 16: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరి యా దవాఖానలో 69 ఏండ్ల వృద్ధుడికి మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఇలాంటి శస్త్రచికిత్స రాష్ట్రంలోనే తొలిసారని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్రావు చెప్పారు. జి ల్లాలోని కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన కదిరె భూంరెడ్డి మోకాళ్లనొప్పులతో బాధపడుతూ ఏరియా దవాఖానకు వచ్చాడు.
పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ చేయాలని వృద్ధుడి కుటుంబసభ్యులకు చెప్పారు. డాక్టర్ అనిల్కుమార్, డాక్టర్ శశి, డాక్టర్ తిరుపతితో కూడిన బృందం శనివారం భూంరెడ్డి ఎడమకాలు మోకాలు కీ లు మార్పిడి చేశారు. రెండురోజుల త ర్వాత నడిపించారు. ప్రైవేట్ దవాఖాన లో రూ.1.50 లక్షలు ఖర్చయ్యే చికిత్స ను ఏరియా దవాఖానలో ఉచితంగా చేశామని సూపరింటెండెంట్ తెలిపారు.