హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే పారిశ్రామిక రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది.
తాజాగా కిటెక్స్ గ్రూప్.. తెలంగాణలో మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు సుముఖంగా ఉంది. ఈ నేపథ్యంలో కిటెక్స్ గ్రూప్ చైర్మన్ సాబ్ ఎం జాకబ్తో సహా ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందం ఇవాళ రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశం కానున్నారు. రూ. 3,500 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు కిటెక్స్ గ్రూప్ సిద్ధంగా ఉంది.
అయితే ఈ పెట్టుబడిని కేరళలో పెట్టాలని కిటెక్స్ గ్రూప్ భావించినప్పటికీ, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, టీఎస్ ఐపాస్ విధానం నచ్చడంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. మంత్రి కేటీఆర్తో పెట్టుబడులపై కిటెక్స్ గ్రూప్ ప్రతినిధుల బృందం చర్చించనుంది.