హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కేంద్ర మంత్రి పదవిలో ఉండి మత ఛాందస్థుడిలా, మత విద్వేషిలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టో హిందూ వ్యతిరేక మ్యానిఫెస్టో అని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జిన్నా రాజ్యాంగం వస్తుందని కిషన్రెడ్డి వ్యాఖ్యానించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తున్నదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేదర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, ఆ విషయాన్ని మరిచి కిషన్రెడ్డి వ్యాఖ్యానించడం ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనని నిరంజన్ పేర్కొన్నారు. బీజేపీకి అంబేదర్ రాసిన రాజ్యాంగంపై గౌరవముందా? అనే అనుమానం కలిగిస్తుందని అన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఏ అంశము హిందూ వ్యతిరేకమో, రాజ్యాంగ విరుద్ధ మో కిషన్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మత పరమైన, భాషాపరమైన మైనారిటీలకు రాజ్యాంగం ఇచ్చిన హకులను పరిరక్షించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మ్యానిఫెస్టోలో పేరొంటే బీజేపీకి కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కిషన్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని నిరంజన్ పేర్కొన్నారు.