Kishan Reddy | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నల్లగొండకు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి పచ్చి సమైక్యవాది అని, సిగ్గు శరం లేని నాయకుడు అని జిట్టా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం జిట్టా బాలకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
పార్టీలో మరో నాయకుడు ఎదగొద్దనేది కిషన్ రెడ్డి ఆలోచన అని ఆరోపించారు. మీడియాకు లీకులిచ్చి.. స్వయంగా ఈటల రాజేందర్ బీజేపీని బలహీనపరిచాడని ధ్వజమెత్తారు. అమిత్ షా, జేపీ నడ్డాలను తిట్టిన రఘునందనరావును కిషన్ రెడ్డి సంకలో పెట్టుకుని తిరుగుతున్నాడు. తనను సస్పెండ్ చేసేకంటే ముందు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘునందనరావు, ఈటల రాజేందర్, ఏ.చంద్రశేఖర్, రవీందర్ నాయక్లను సస్పెండ్ చేయాలని జిట్టా బాలకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ రాజసింగ్పై సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేయటం లేదు? అని ఆయన ప్రశ్నించారు.