కరీంనగర్, మార్చి 21( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణపై విషం చిమ్ముతూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 4.53 లక్షల బస్తాల ధాన్యం మాయమైందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని లెక్క చెప్పారు. 2021 యాసంగి, 2021-22 వానకాలం కలిపి దాదాపు 40.50 కోట్ల బస్తాల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరిచిందని, ఇందులో 4.53 బస్తా లు అంటే 0.001 శాతం మాత్రమే అవుతుందని, ఈ మాత్రం కూడా మాయం కాలేదని స్పష్టం చేశారు. పౌర సరఫరాలు, ఎఫ్సీఐ లెవీ సేకరణపై ఏ మాత్రం అవగాహన లేకుండా, తెలంగాణకు చెందిన కేంద్రమంత్రిననే సోయి లేకుండా కిషన్రెడ్డి మాట్లాడటం తగదని హితవు పలికారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, రైతులను కించపరిచేలా మాట్లాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎఫ్సీఐ అశాస్త్రీయ పరిశీలనను పరిగణనలోనికి తీసుకొని కేంద్ర మంత్రి మాట్లాడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కిషన్రెడ్డి ఆరోపణలు చేస్తున్నట్టుగా మాయమైన ధాన్యానికి, కేంద్రాని కి ఏమై నా సంబంధం ఉన్నదా? కేంద్రం ఏమైనా డబ్బులు చెల్లించిందా? అని ప్రశ్నించారు. ధాన్యంపై పౌరసరఫరాలశాఖ నిరంతరం నిఘా ఉంటుందన్న విషయం కేంద్ర మంత్రికి తెలియకపోవడం బాధాకరమన్నారు. ఎఫ్సీఐ అస్తవ్యస్థ పరిశీలనపై రాష్ట్ర ప్రభుత్వ యం త్రాంగం సమగ్రంగా అధ్యయనం చేసిందని వివరించారు. ఎఫ్సీఐ అధికారులు కామారెడ్డి జిల్లా వెంకటరమణ ఆగ్రో ఇండస్ట్రీలో బియ్యం బస్తాలను ధాన్యం బ స్తాలుగా లెక్కించి.. 84,927 బస్తాలు తక్కువగా ఉన్నట్టు చూపించారని, దీనిపై ఎఫ్సీఐ జనరల్ మేనేజర్కు లేఖ రాశామని వెల్లడించారు. సిద్దిపేట జి ల్లాలో 64 బస్తాలు తక్కువగా ఉంటే ఎఫ్సీఐ మాత్రం 1,659 బస్తాలు తగ్గినట్టు పేర్కొన్నదని తెలిపారు. పరిశీలించిన 40 మిల్లుల్లో 2 నుంచి 10 బస్తాలు తక్కువ గా ఉన్న మిల్లులు ఉన్నాయని, బస్తాలు చిరిగిన కారణంగా కుప్ప గా పోసిన ధాన్యాన్ని ఎఫ్సీఐ పరిగణనలోనికి తీసుకోకపోవడం అశాస్త్రీయమని చెప్పారు. ఎఫ్సీఐ పరిశీలన రాజకీయ కోణంలో సాగిందని దుయ్యబట్టారు.
తెలంగాణపై ఎందుకీ ఈ వివక్ష
ఎఫ్సీఐ పరిశీలన అసమగ్రంగా, అసంబద్ధంగా ఉన్నదని గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ర్టాల్లో తనిఖీలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. వాటిపై శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్సీఐ, కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.4వేల కోట్ల నష్టం భరిస్తూ రైతులను కాపాడుకొంటున్నారని చెప్పారు. కేంద్రం కొర్రీలను అడ్డుకోవాల్సింది పోయి, సొంత రాష్ట్రంపై అభాండాలు వేయడం కిషన్రెడ్డికి తగదని హితవు చెప్పారు.
ఐదు రోజుల్లో 2 కోట్ల గన్నీ బ్యాగులు సేకరించాం
గన్నీ బ్యాగ్లు సిద్ధంగా లేవని కిషన్రెడ్డి ఆరోపించడం అవగాహనా రాహిత్యమని మంత్రి గంగుల పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన మొదటి మీడియా సమావేశంలోనే రాష్ట్ర మంత్రిగా 1.60 కోట్ల గన్నీ బ్యాగులున్నాయని చెప్పానని గుర్తు చేశారు. ప్రస్తుతం 3.50 కోట్లకు పైగా గన్నీ బ్యాగులు ఉన్నాయని స్పష్టంచేశారు. కిషన్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే గన్నీ సంచులను లెక్కపెట్టుకోవాలని సవాల్ విసిరా రు. 8 కోట్ల గన్నీ బ్యాగులు కావాలని జూట్ కమిషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాస్తే.. కేవలం 4.40 కోట్ల బ్యా గ్లు మాత్రమే ఇస్తామన్నారని, కేంద్ర మంత్రిగా రాష్ర్టానికి అవసరమయ్యే గన్నీ బ్యాగులను ఎందుకు ఇప్పించడం లేదని ప్రశ్నించారు. ఓపెన్ టెండర్లు పిలిచేందుకు కేంద్రం ఎందుకు మోకాలు అడ్డుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, యంత్రాలు సిద్ధంగా లేవని కిషన్రెడ్డి ఆరోపించడం సిగ్గు చేటని దుయ్యబట్టారు.
కిషన్రెడ్డివి జూటామాటలు
ఎర్రబెల్లి దయాకర్రావు మండిపాటు
దేవరుప్పుల: రైస్ మిల్లుల్లో ధాన్యం మాయమయ్యాయంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించడం మిల్లర్లను అవమానించడమేనని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్ర హం వ్యక్తంచేశారు. జనగామ జిల్లా దేవరుప్పులలో అనంతరామ రైస్ ఇండస్ట్రీస్ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మా ట్లాడుతూ.. కిషన్రెడ్డివి జూటా మాటలని, రాష్ట్రం పై కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రైతులకు సేవలు అందిస్తున్న మిల్లర్లపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోలులో కేంద్రం విఫలమైన చోట రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను స్వీకరిస్తే.. ఏర్పాట్లు చేయలేదని, గోనె సంచులు లేవని విమర్శించడం కిషన్రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కేంద్రం సహకరించకున్నా రైతులను ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్కు తెలుసునని, కిషన్రెడ్డితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. బండి లాంటి ద గాకోర్లు రైతులను రెచ్చగొడుతుంటే, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కిషన్రెడ్డి రైతులను నిం డా ముంచుతున్నారని మండిపడ్డారు. ప్రజలు కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఆ పార్టీ నేతల తీరును గమనిస్తున్నారని, బీజేపీని ఛీత్కరిం చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు.