Kishan reddy | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డిని ప్రకటించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. మరోసారి ఉద్యమ ద్రోహికే పట్టం కట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2010 ఫిబ్రవరి 10న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలం తా రాజీనామా చేశారు. అప్పట్లో బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు యెండెల లక్ష్మీనారాయ ణ, కిషన్రెడ్డి ఉండేవారు. ఇందులో లక్ష్మీనారాయణ రాజీనామా చేయగా, కిషన్రెడ్డి ముఖం చాటేశారని గుర్తు చేస్తున్నారు.
2011 డిసెంబర్ 8న ‘జై ఆంధ్ర’ ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని కిషన్రెడ్డి ట్వీట్ చేశారని పేర్కొంటున్నారు. అక్కడితో ఆగిపోలేదని, తెలంగాణ ఏర్పాటు తర్వాత సైతం అనేకసార్లు అవమానించారని గుర్తు చేస్తున్నారు. పార్లమెంట్ చరిత్రలో తెలంగాణ ఏర్పాటు ఒక బ్లాక్ డే అని అమిత్ షా అన్నప్పుడు అదే సభలో ఉన్న కిషన్రెడ్డి బల్లలు చరిచారని చెప్తున్నారు. మోదీ అనేకసార్లు తెలంగాణ ఏర్పాటును అవమానించినప్పుడు కూడా కిషన్రెడ్డి కేంద్ర మంత్రి పదవిలో ఉండి మద్దతు పలికారే తప్ప, కనీసం ఆ తర్వాతైనా ఖండించలేదని మండిపడుతున్నారు.
2020 ఫిబ్రవరిలో జరిగిన ఓ కార్యక్రమంలో కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ‘రైల్వే అంటే తెలంగాణ ప్రజలకు తెల్వదు. ఎర్రబస్సు ఎక్కే అలవాటు మాత్ర మే ఉండేది. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చా కే అనేక కొత్త రైళ్లను ప్రారంభించాం’ అంటూ చెప్పారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణపై ఆయన అవగాహన రాహిత్యానికి ఇది నిదర్శనమని అంటున్నారు. 1870లోనే నిజాం రాజ్యంలో రైల్వే వ్యవస్థ మొదలైందని మర్చిపోయారని, 1907లో నాంపల్లి రైల్వే స్టేషన్, 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్ ఏర్పాటయ్యాయని తెలుసుకోలేకపోయారని ఎద్దేవా చేస్తున్నారు.
పదవి ఇష్టంలేని కిషన్రెడ్డి?
రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి స్వీకరించడానికి కిషన్రెడ్డి ఇష్టపడటం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత మంగళవా రం రాత్రి వరకు కనీసం అధిష్ఠానానికి ధన్యవాదాలు చెప్తూ ఒక ప్రకటన గానీ, ట్వీట్ గానీ చేయలేదు. కార్యకర్తలు, అభిమానుల హడావుడి కూడా ఎక్కడా కనిపించలేదు. విలేకరులు ఎన్నిసార్లు ప్రశ్నించినా కిషన్రెడ్డి మౌనంగానే ఉండిపోయారు. దీనిని బట్టే ఆయన అధ్యక్ష బాధ్యతలు వద్దనుకుంటున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నదని, కనుమరుగయ్యే స్థితిలో ఉన్న పార్టీకి తనను అధ్యక్షుడిని చేస్తే ఏం లాభమని కిషన్రెడ్డి భావిస్తున్నట్టు చెప్పుకొంటున్నారు. మరోవైపు అధ్యక్ష పదవి ఇచ్చి తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలిగిస్తారేమోనని కిషన్రెడ్డి అందోళన చెందుతున్నారని అంటున్నారు.