హైదరాబాద్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనపై(Congress party) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో(Grain purchases) కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. తెలంగాణలో పన్నులు వసూలు చేసి ఢిల్లీలో ఇవ్వడానికి సమయం ఉంటుందని కాని రైతులను పట్టించుకునేందుకు లేదని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాయంలో రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మార్పు కోసం కాంగ్రెస్కు ఓటేస్తే మారింది ఏమీ లేదన్నారు.
రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను ఇంకా అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పి ఇంకా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు రూ. 25 వేలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.