KCR | జనగామ, మార్చి 31 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బందోబస్తును జనగామ జిల్లా పోలీసు యంత్రాంగం గాలికి వదిలేసింది. ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఎండిన పంటల పరిశీలన కోసం పొలంబాట పేరిట చేపట్టిన పర్యటనలో కేసీఆర్కు తగినం త భద్రత కల్పించడంలో పోలీసుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్తండాలో ప్రధాన రోడ్డుపై కాన్వాయ్ నిలిచిన తర్వాత ఎండిన పొలాన్ని చూసేందుకు కేసీఆర్ ముం దుకు వెళ్లకుండా అడ్డుగా ఉన్న వారిని తప్పిం చి రూట్క్లియర్ చేయాల్సిన స్థానిక పోలీసు లు పట్టించుకోలేదు. రోప్ పార్టీ పోలీసులు హైవేకే పరిమితమయ్యారు.
కేసీఆర్ పొలం వద్దకు వెళ్లేందుకు రూట్ క్లియర్ చేయాలని పార్టీ ప్రతినిధులు మైక్లో పలుమార్లు పోలీసులను అభ్యర్థించినా పట్టించుకోకపోవడం తో కేసీఆర్ బస్సు నుంచి కిందకు దిగేందుకు చాలా సమయం పట్టింది. బందోబస్తుకు పోలీసులు సహకరించడం లేదన్న సంగతి గుర్తించి బస్సులో అధినేత వెంట వచ్చిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ సంతోష్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు కేసీఆర్ తోపులాటకు గురికాకుండా రక్షణ వలయంగా ఏర్పడి ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. చివరకు ప్రైవేట్ రోప్ పార్టీ సెక్యూరిటీ గార్డుల ద్వారా కేసీఆర్ రైతులతో మాట్లాడాల్సి వచ్చింది. కేసీఆర్ కాన్వాయ్ ధరావత్తండాలో ఆగిన తర్వాత తిరిగి వెళ్లే వరకు ఇరువైపులా ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.