న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: భారత్లో వినియోగిస్తున్న ‘ఫెయిర్నెస్’ క్రీములతో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. అందమైన ముఖం, కాంతివంతమైన శరీరం కోసం వాడుతున్న ఫెయిర్నెస్ క్రీములకు భారత్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది.
ఈ క్రీముల్లో ఉండే మెర్క్యురీ (పాదరసం) కిడ్నీలను దెబ్బతీస్తుందని మెడికల్ జర్నల్ ‘కిడ్నీ ఇంటర్నేషనల్’ వార్తా కథనం ప్రచురించింది.