మషీరాబాద్, ఏప్రిల్ 4: మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో రాజకీయ సమాధి చేస్తామని ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ నగర నాయకులు హెచ్చరించారు. మాదిగలకు కాంగ్రెస్ ఒక్క ఎంపీ సీటు కేటాయించకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ రాంనగర్ చౌరస్తాలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం రేవంత్రెడ్డి, ఖర్గేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గజ్జెల రాజశేఖర్ మాదిగ, నగర నేతలు గండి కృష్ణ, ఇనుముల నర్సయ్య మాట్లాడారు. ఎస్సీల్లో నూటికి 70 శాతం ఉన్న మాదిగలకు కాంగ్రెస్ ఒక్క ఎంపీ సీటు కూడా కేటాయించకుండా ద్రోహం చేసిందని మండిపడ్డారు. మాదిగ ఉపకులాల నేతలకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్లో ఇంతకాలం పనిచేసిన మాదిగ నేతలను పక్కనబెట్టి వంచించిందని ఆరోపించారు. మాదిగలను విస్మరిస్తే చంద్రబాబుకు ఏ గతి పట్టిందో భవిష్యత్తులో రేవంత్కూ అదేగతి పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రవీందర్, మురళి, మహేశ్, నర్సింగరావు, రోషిన్ వినయ్, సాయిలు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.