హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఖమ్మం నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడంపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది. ఫొటో, వీడియో జర్నలిస్టులకు కూడా స్థలాలు ఇవ్వాలని చెప్పడాన్ని స్వాగతించింది.
ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, ఐజేయూ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్, కార్యదర్శి రాజమౌళి చారి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. పెండింగ్లో ఉన్న ఇండ్ల స్థలాల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన ఖమ్మం టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఆదినారాయణ బృందాన్ని వారు అభినందించారు.