ఖమ్మం, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని, కాంగ్రెస్లాగా ఢిల్లీ, బెంగళూరు హైకమాండ్స్ ఉండవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ ల మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రజలకు ఇచ్చి న హామీలన్నింటినీ బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. ‘ప్రజలకు చేసిన మం చిని చెప్పడం నోబుల్ విధానం. అందుకే మా పార్టీ నోబుల్. మా నేతలు నోబుల్స్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆచరణ సాధ్యంకాని హామీలిస్తున్నారు. బీఆర్ఎస్పై అసంబద్ధమైన గోబెల్స్ ప్ర చారం చేస్తున్నారు. వారిది గోబెల్స్ విధానం. వ చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నోబుల్స్, గోబెల్స్ మధ్యే పోరాటం’ అని స్పష్టంచేశారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి మంత్రి హరీశ్రావు గురువారం ఖమ్మంలో పర్యటించారు.
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖమ్మం వైద్య కళాశాలలో పలు విభాగాల భవనాలను ప్రారంభించారు. నగరంలోని మమత మెడికల్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ భవనాన్ని ప్రారంభించారు. అక్కడే నిర్వహించిన పువ్వాడ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలో పాల్గొన్నారు. తర్వాత పువ్వాడ అజయ్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు అబద్ధాలను నమ్ముకొంటే, బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమాన్ని నమ్ముకొన్నదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వాన్నే ప్రజలు విశ్వసిస్తారని, అందుకే ప్రజలు బీఆర్ఎస్వైపు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అనేక ప్రాజెక్టులను పెం డింగ్లో పెట్టారని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిందని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించనున్నారని చెప్పారు.
కాంగ్రెస్ది తన్నుల సంస్కృతి..
కాంగ్రెస్ది తన్నుల సంస్కృతి అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వానిది టన్నుల సంస్కృతి అని మంత్రి అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎరువులు, విత్తనాలు, సాగునీటి కోసం తన్నులాట జరిగేదని, వ్యవసాయం ధ్వంసమైందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతులు టన్నులకొద్దీ ధాన్యం పండించి దేశానికే అన్నం పెడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలు బీఆర్ఎస్నే ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత కలహాలు సృష్టిస్తుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో వైద్య విప్లవం..
రాష్ట్రంలో వైద్య విప్లవం నడుస్తున్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. ఏ రంగంలో తీసుకున్నా దేశంలో తెలంగాణే అగ్రస్థానంలో నిలుస్తున్నదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులు వైద్యవిద్య చదివేందుకు రష్యా, ఉక్రెయిన్, చైనా, పిలిప్పైన్స్ వెళ్లి లక్షలకు లక్షలు వెచ్చించాల్సి వచ్చేదని.. ఇప్పుడు తెలంగాణలో ఆటో డ్రైవర్లు, హమాలీల పిల్లలు కూడా మెడికల్ సీట్లు సాధిస్తున్నారని చెప్పారు. మెడికల్ కళాశాలల్లో ప్రస్తుతం అడ్మిషన్ ఫీజు ఏడాదికి రూ.10 వేలు మాత్రమేనని వెల్లడించారు. ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ ఆమోదించడంపై హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో నర్సింగ్ కళాశాలకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తాతా మధుసూదన్, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, పాలేరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియానాయక్, వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
10 స్థానాలు గెలుస్తాం: పువ్వాడ
ఖమ్మం జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందని రోజుల్లో తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు మమత వైద్యశాలను స్థాపించారని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సమైక్య పాలనలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 100 పడకలు ఉండేవని, తెలంగాణ వచ్చాక 500 పడకలకు పెంచామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చొరవతో ఖమ్మం, కొత్తగూడెంలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తుందని స్పష్టంచేశారు.