హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశుడు మరి కొద్దిసేపట్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఖైరతాబాద్లో ప్రారంభమైన పంచముఖ రుద్ర గణపతి శోభాయాత్ర ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్నది. ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నంబర్ 4 వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం లంబోదరుడిని ట్యాంక్బండ్లో వేయనున్నారు.
ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమిచ్చాడు. కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరాడు. తొమ్మిది రోజులపాటు భక్తుల చేత విశేష పూజలు అందుకున్నాడు. 40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పుతో మహగణపతి విగ్రహాన్ని రూపొందించారు.