హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ సాధించాలని ఖాదీమ్ పీర్ సయ్యద్ సుల్తాన్-ఉల్-హసన్ మిస్బాహీ నేతృత్వంలో గురువారం అజ్మీర్ దర్గాలో చాదర్ సమర్పించారు. అజ్మీర్ దర్గా కమిటీ కార్యాలయం నుంచి చాదర్ను ఖవ్వాలితో ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు.
రాష్ర్టానికి చేరుకున్న అనంతరం మొయినుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రార్థించినట్టు చెప్పారు. కేసీఆర్ అజేయయాత్ర చేయాలని తాము కోరుకున్నామని చెప్పారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించామన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.