వంగూరు, సెప్టెంబర్ 18: ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకొని ప్రజలకు న్యాయం చేయాల్సిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్తో అడ్డంగా సంపాదిస్తున్న దుర్మార్గుడని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలకేంద్రంలో టీఆర్ఎస్ నేతలతో కలిసి విప్ గువ్వల శనివారం విలేకరులతో మాట్లాడారు. అదే ఆర్టీఐని వాడుకుని నీభరతం పడుతామని హెచ్చరించారు. గజ్వేల్ సభలో అంబేద్కర్ చిత్రపటాన్ని అవమానించిన రేవం త్కు దళితుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై అనవసర ఆరోపణలు చేస్తే సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దమ్ముంటే మంత్రి కేటీఆర్ సవాల్ ను స్వీకరించాలని సూచించారు. చంద్రబాబు బినామీగా తెలంగా ణలో వ్యవహరిస్తున్న రేవంత్కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికే ఏం చేయలేని రేవంత్ రాష్ర్టానికి ఏం చేస్తాడని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, దాన్ని మరింత ముంచుతున్నాడని విమర్శించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్తామని గువ్వల హెచ్చరించారు. సమావేశంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.