హైదరాబాద్ : రాష్ట్రంలోని ఉద్యోగాల ఖాళీలపై ఆదివారం కీలక సమావేశం జరగనుంది. ఖాళీలపై రేపు అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆయా శాఖలు సమర్పించిన ఖాళీల వివరాలపై వీరు సమీక్ష చేయనున్నారు.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 (యాభై వేలు) ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో భర్తీ చేయాలన్నారు.