కేసముద్రం/ఖమ్మం వ్యవసాయం, మార్చి 14 : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. మంగళవారం తేజ రకం మిర్చి క్వింటాల్కు రూ.22,151 పలకడం ఈ ఏడాది ఇదే గరిష్ఠ ధర కావడం విశేషం.
కాగా వరంగల్ ఎనుమాముల మార్కెట్లో తేజ రకం రూ. 21,600, ఖమ్మం మార్కెట్లో రూ.21,800, మహబూబాబాద్లో రూ.22,010, ఏపీలోని గుంటూరు మార్కెట్లో రూ.21,500 పలికింది. ఆశించిన మేర ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.