KCR : మహా శివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా జీవించేలా దీవించాలని పరమశివుడిని ప్రార్ధిస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. సహనానికి, త్యాగానికి ప్రతీక.. సృష్టి లయకారుడైన ఉమా మహేశ్వరుడు హిందూ మత భక్తులచేత నిత్య పూజలందుకుంటారని గులాబీ బాస్ పేర్కొన్నారు.
భక్తి శ్రద్ధలతో కొలిస్తే చాలు సామాన్య భక్తుల కోరికలూ తీర్చే భోళా శంకరునిగా భారతీయ ఆధ్యాత్మిక సామాజిక జీవనంలో పరమశివునిది ప్రత్యేక స్థానం అని కేసీఆర్ అన్నారు. ప్రాణకోటిని రక్షిస్తూ, సృష్టి మనుగడకోసం గరళాన్ని మింగిన మహా త్యాగి శంకరుడు.. ఆది యోగి, గరళకంఠుడు, ఆ పరమేశ్వరుడు అని కొనియాడారు. తెలంగాణ ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించి, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేలా దీవెనలు అందించాలని, దేవ దేవుడైన ఆ చంద్రశేఖరుడిని కేసీఆర్ ప్రార్థించారు.