CM KCR | హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 19, 20 తేదీల్లో మెదక్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. 19న మెదక్ జిల్లాలో పర్యటించి కలెక్టర్, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాలను ప్రారంభిస్తారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 20న సూర్యాపేట జిల్లాలో పర్యటించి కలెక్టరేట్, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాలతోపాటు నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీని కూడా ప్రారంభిస్తారు. అనంతరం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.