హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపించి మరిన్ని విజయాలు సాధించాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. దేశరాజధానిలో లాల్ ఖిల్లాపై త్రివర్ణ పతాకాన్ని ఒక తెలుగువాడు ఎగురవేయటం కొత్త కాకున్నా, 30 ఏండ్ల తర్వాత కేసీఆర్ రూపంలో మరో అవకాశం దక్కనున్నదని ఆకాంక్షించారు. ‘ఈ నిద్రాణ నిశీధిని మహిత జాగృతి పుంజముగ వెలుగుటయే నా తపస్సు-వెలిగించుట నా ప్రతిజ్ఞ’ అంటూ కవిత వినిపించారు. కేసీఆర్ మళ్లీ చరిత్ర సృష్టించే శుభసూచనలు కనిపిస్తున్నాయని ‘ఢిల్లీ బహుత్ నజ్దీక్ హై’ అని ఆమె తెలిపారు.