హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్(బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించి నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు. నిర్ణీత గడువులోగా నిర్మాణం మొత్తం పూర్తి చేయాలని సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.
పార్టీ కేంద్ర కార్యాలయం కోసం ఢిల్లీలోని వసంత్విహార్లో 1,200 గజాల స్థలంలో జీ+3 అంతస్థుల భవనం నిర్మిస్తున్నారు. సీఎంతో పాటు రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్రావు, సంతోష్కుమార్, వద్దిరాజు రవిచంద్ర, ప్రముఖ వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్ తేజ ఉన్నారు.