KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడు నెలల తర్వాత తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను ఈ సందర్భంగా కేసీఆర్ సమీక్షించనున్నారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్షించి.. కృష్ణా జలాల అంశంపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్కు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు పలువురు కీలక నేతలు సైతం తెలంగాణ భవన్కు వచ్చారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ రాష్ట్ర సమితి భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నది. కేఆర్ఎంబీపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాలపై ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకపోయే విధంగా ఉద్యమ కార్యాచరణ చేయనున్నారు.