HomeTelanganaKcr To Inaugurate Temple Mosque Church At Telangana Secretariat On August 25
అద్భుతంగా గుడి, మసీదు, చర్చి
సచివాలయంలో 25న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న గుడి, మసీదు, చర్చి ఏర్పాట్లను శనివారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరిశీలించారు.
సచివాలయంలో 25వ తేదీన ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల వెల్లడిహైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): సచివాలయంలో 25న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న గుడి, మసీదు, చర్చి ఏర్పాట్లను శనివారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయంలో గతంలో ఉన్న నిర్మాణాలకంటే గుడి, మసీదు, చర్చి నిర్మాణాలు మరింత అద్భుతంగా జరిగినట్టు తెలిపారు. 2236 చదరపు గజాల విస్తీర్ణంలో గుడిని నిర్మించినట్టు చెప్పారు. పనులన్నీ పూర్తయ్యాయని, సర్వమత సౌభ్రాతృత్వం పరిఢవిల్లేలా ఈ ప్రార్థనా మందిరాలు నిర్మించినట్టు పేర్కొన్నారు. శివాలయం, పోచమ్మ, హనుమాన్, గణపతి ఆలయాలు ఇందులో ఉన్నట్టు పేర్కొన్నారు. దేవతామూర్తుల విగ్రహాలను తిరుపతిలో తయారు చేయించి తెచ్చినట్టు చెప్పారు. యాగంతో ఆలయాలను అలాగే, మసీదు, చర్చి ఆయా మతపెద్దల సమక్షంలో ప్రారంభించనున్నట్టు మంత్రి వివరించారు.