కరీంనగర్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ రూరల్ మం డలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మంత్రి గంగుల మాట్లాడుతూ.. అనేక సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తున్న కేసీఆర్ సర్కారును కాపాడుకునే బాధ్యత రైతులదేనని చెప్పారు.
ఇక్కడి బొగ్గు, నీరు, హైదరాబాద్ సొత్తును దోపిడీ చేసేందుకు మళ్లీ కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతు ను రాజుగా చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నదని, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం లో బీళ్లుగా ఉన్న భూములన్నీ స్వరాష్ట్రంలో సస్యశ్యామలంగా మారుతున్నాయని తెలిపారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా పచ్చని పొలాలే కనిపిస్తున్నాయని చెప్పారు.