Khammam Meeting | వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యమని సీఎం కేసీఆర్ ప్రకటించారని, అందుకే బీఆర్ఎస్కు మద్దతిస్తున్నామని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. సమర్థించే ముందు పార్టీ పేరు, నాయకుడి బొమ్మ చూసో సమర్థించడం, వ్యతిరేకించడం సీపీఎం పార్టీకి అలవాటు లేదన్నారు. పార్టీ ప్రకటించే విధానాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రకటించిందని, బీఆర్ఎస్ లక్ష్యం వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని మట్టికరిపించడం, మోదీని గద్దె దించడమేనని ప్రకటించడం మాకు నచ్చిందని, ఎందుకు నచ్చింది బీజేపీ, నాయకులంటేనే వ్యక్తిగత కోపమో, వారితో ఉన్న పంచాయితో కారణం కాదన్నారు. బీజేపీ సాదాసీదా రాజకీయ పార్టీ కాదని, దాని వెనుక ఫాసిస్ట్ సిద్ధాంతాలున్న ఆర్ఎస్ఎస్ సంస్థ ఉందన్నారు.
దేశాన్ని పరిపాలించే అధికారాన్ని బీజేపీకి కొనసాగిస్తే.. మన దేశం సర్వనాశనం అవుతుందన్న ఆయన.. దేశంలో ఎన్నో మతాల ప్రజల.. వందల ఏళ్లుగా అన్నాదమ్ముళ్లుగా బతుకుతున్నారని, ద్వేషం లేని సమాజం మనదని, అట్లాంటి సమాజంలో కులాలు మతాల చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రావణకష్టం రగిల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. బీజేపీని లేకుండా చేస్తేనే.. మనం బాగుపడుతామన్న ఆయన.. ఆ లక్ష్యం సీపీఎం పార్టీ కలిగి ఉందన్నారు. తెలంగాణలో కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, అందుకే బీఆర్ఎస్ విధానాన్ని సీపీఎం సమర్థిస్తోందన్నారు. ఈ పార్టీ ముందుకు సాగాలని కోరుకుంటుందని.. ఎన్నికలు, పొత్తలు, గెలుపులు చిన్న విషయం కానీ.. ముందు దేశం ముఖ్యమన్నారు. బీజేపీని బొందపెట్టేందుకు ఎవరితోనైనా కలుస్తామని స్పష్టం చేశారు.