KCR | హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): యశోద దవాఖానలో ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, పార్టీ శాసనసభా పక్షనేత కేసీఆర్ శుక్రవారం డిశ్చార్జి కానున్నారు. ఈ విషయాన్ని వైద్యులు ప్రకటించారు. దవాఖాన నుంచి నేరుగా ఆయన బంజారాహిల్స్ నందినగర్లోని ఇంటికి రానున్నారు. గురువారం దవాఖానలో కేసీఆర్ను పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రు లు పరామర్శించారు. పెద్దమ్మతల్లి ఆలయ అర్చకులు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని దీవించారు.
గురువారం కేసీఆర్ను పరామర్శించినవారిలో ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, నవీన్కుమార్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, గంగుల కమలాకర్, ప్రముఖ వ్యాపారవేత్త సీఎల్ రాజం దంపతులు, సినీనటుడు నరేశ్, మాజీ ఎమ్మెల్యేలు వీ శ్రీనివాస్గౌడ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, అంజయ్యయాదవ్, కంచర్ల భూపాల్రెడ్డి, దాసరి మనోహర్రెడ్డి, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, సోమా భరత్కుమార్, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, దూదిమెట్ల బాలరాజు, కోలేటి దామోదర్, ఆంజనేయగౌడ్, సతీశ్రెడ్డి, పల్లె రవికుమార్, బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, రాము, గాయకుడు దరువు ఎల్లన్న, ఆంధ్రప్రభ మేనేజింగ్ డైరెక్టర్, ఎడిటర్ ఇన్చార్జ్ ఎండీ ముత్తా గౌతమ్ తదితరులు ఉన్నారు.
ప్రముఖ సినీ దర్శకుడు జీవన్రెడ్డి, నటుడు సందీప్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గురువారం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.