హుజూరాబాద్టౌన్ (జమ్మికుంట), మే 1: సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని టీఆర్ఎస్ జమ్మికుంట పట్టణ మాజీ అధ్యక్షుడు, సీనియర్నేత, జమ్మికుంట మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య అన్నారు. టీఆర్ఎస్ టికెట్తో, సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజాప్రతినిధులుగా గెలిచిన నాయకులు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే ఈటలకు మద్దతు తెలుపాలని హితవుపలికారు. శనివారం జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం ఈటల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలంతా కట్టుబడి ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కొందరు నాయకులకు ఈటల అధిక ప్రాధా న్యం ఇవ్వడంవల్లే వారు అత్యుత్సాహంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్కుమార్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈటల తనకు నచ్చిన పార్టీలోకి వెళ్లవచ్చని, తాము టీఆర్ఎస్కు విధేయులమై ఉంటామని చెప్పారు. ఎవరైనా పార్టీని, సీఎంను విమర్శిస్తే సహించబోమని హెచ్చరించారు. సమావేశంలో టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జి ఆలేటి శ్రీరామ్, టీఆర్ఎస్ నాయకులు మేడిపల్లి ఓదెలు, కొత్తగట్టు భాస్కర్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.