హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): నిరుపేద మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ‘కేసీఆర్ కానుక’ పేరిట ప్రభుత్వం 20 వేల కుట్టుమిషన్లను అందజేయనున్నది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగిసిందని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. త్వరలోనే అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఒంటరి, వితంతు, విడాకులు పొందిన, అత్యంత నిరుపేద మైనార్టీ మహిళలకు తొలి ప్రాధాన్యత ఉంటుందని, కుటుంబంలో ఒకరికే అవకాశం ఉంటుందని తెలిపారు.