కామారెడ్డి : త్వరలోనే కేసీఆర్(KCR) భారతదేశానికి నాయకత్వం వహించబోతున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Ministrer Vemula ) అన్నారు. దేశంలోనే అత్యంత బలమైన శక్తిగా బీఆర్ఎస్(BRS) అవతరించనున్నదని తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్కు ఇతర రాష్ట్రాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. మహారాష్ట్ర(Maharastra) ప్రజలంతా ఏకమై మద్దతు ఇందుకు ఉదాహరణ అని అన్నారు. తెలంగాణ పథకాలు తమకు కూడా కావాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. అహంకారి నరేంద్ర మోదీ(Narendra Modi) రాబోయే రోజుల్లో దిగిపోవడం ఖాయం.. దేశమంతటా బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అమలవడం ఖాయమని వెల్లడించారు. అదానీ(Adani), నరేంద్ర మోదీ(Narendra Modi)కి బినామీ అని ఆరోపించారు.
బినామీ డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోనూ అదే ప్రయత్నం చేస్తే సీఎ కేసీఆర్(CM KCR) వాళ్లకు సినిమా చూపెట్టిండని తెలిపారు. ఈ కేసు నుంచి తప్పించుకోవాలనే కుట్రతో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని కవితమ్మను సంబంధం లేని కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు.ఆడబిడ్డ అని కూడా చూడకుండా విచారణల పేరిట వేధిస్తున్నారని మండిపడ్డారు.బండి సంజయ్ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సున్నాలు వేసుకునే రేవంత్ రెడ్డికి కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని మంత్రి వేముల ప్రశ్నించారు.