Himanshu Rao | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఉద్యమ రథసారథి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎందరికో ఆదర్శం. అటు ఉద్యమ సమయంలోనూ, ఇటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ.. వ్యవసాయంపై తనకున్న మక్కువను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. బిజీ షెడ్యూల్లోనూ వ్యవసాయంపై దృష్టి సారించేవారు కేసీఆర్. అంతేకాదు.. ఈ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడనే ఉద్దేశంతో హరితహారం వంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టి.. హరిత విజయం సాధించారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడా చూసినా భూమికి ఆకుపచ్చ రంగేసినట్టు.. ఈ రాష్ట్రాన్ని తయారు చేశారు కేసీఆర్. ప్రతి ఏడాది కొన్ని కోట్ల మొక్కలు నాటి హరిత సంపదను సృష్టించారు.
ఇప్పుడు కేసీఆర్ అడుగుజాడల్లో ఆయన మనువడు కల్వకుంట్ల హిమాన్షు రావు నడుస్తున్నాడు. తీరిక సమయంలో తన తాతయ్యతో వ్యవసాయ క్షేత్రంలో హిమాన్షురావు గడుపుతూ.. రైతన్నలా కష్టపడుతున్నాడు. పార చేతబట్టి.. అన్నదాతల మారిపోయాడు. చెమటోడ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయాడు. మనువడు పడుతున్న కష్టాన్ని చూసి కేసీఆర్ కూడా మురిసిపోయారు.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో హిమాన్షు రావు తన తాత సూచనలతో తానే స్వయంగా పారతో మట్టి తీసి, ఓ చెట్టును నాటాడు. ఆ చెట్టు చుట్టూ ఎరువును కూడా పోసి మళ్లీ పారతో మట్టిని కప్పాడు. ఆ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన హిమాన్షు.. ఓ సందేశం ఇచ్చాడు. ఉత్తముల నుంచి నేర్చుకోవడం అని రాసుకొచ్చాడు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి అడవుల పెంపకం చాలా అవసరం అని పేర్కొన్నాడు. మన సహజ వనరులను రక్షించడం, సంరక్షించడం మన బాధ్యత అని హిమాన్షు రావు మేసేజ్ ఇచ్చాడు.
Learning from the best ❤️🥰
Afforestation is essential to mitigate the effects of climate change, and we are responsible to protect and preserve our natural resources. pic.twitter.com/TreaW2inDm
— Himanshu Rao Kalvakuntla (@TheHimanshuRaoK) January 16, 2025
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | ఇక ఢిల్లీని ఉద్ధరిస్తడంట.. అసెంబ్లీ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి గప్పాలు..!
Congress | నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే.. గాంధీ భవన్ మెట్ల మీద ధర్నా చేస్తా : సునీతారావు
BRS Party | ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు