BRS Party | న్యూఢిల్లీ : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ రెండు పిటిషన్లు దాఖలు చేసింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 9 నెలలు అవుతున్నా.. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్కు వ్యతిరేకంగా ఎస్ఎల్పీ దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని కోర్టుకు బీఆర్ఎస్ తెలిపింది. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్లో బీఆర్ఎస్ పేర్కొంది. గతంలో కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోర్టును బీఆర్ఎస్ కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘా చంద్ర కేసులో తీర్పు వచ్చిందని గుర్తు చేసింది. మేఘా చంద్ర కేసు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని బీఆర్ఎస్ తెలిపింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది.
ఇవి కూడా చదవండి..
KTR | బీఆర్ఎస్ నేతలపై పోలీసుల జులుం.. కేటీఆర్కు సంఘీభావం తెలపకుండా అడ్డగింత
Robbers | పట్టపగలే రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. ఏటీఎం వాహనంపై దాడిచేసి నగదు లూటీ
SpaDeX Docking: ఒక్కటైన 2 శాటిలైట్లు.. డాకింగ్ సక్సెస్ వెనుక ఇస్రో ప్లానేంటి !