మల్కాజిగిరి, అక్టోబర్ 18: మల్కాజిగిరి నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ను ఆయన అందుకున్నారు.
ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి, సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.