KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): రాజకీయాలు ఎలా ఉన్నా హైదరాబాద్ను మాజీ సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని సీఎం రేవంత్రెడ్డి ప్రశంసించారు. కేసీఆర్కు ముందున్న ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్సార్లు సైతం హైదరాబాద్ను అభివృద్ధి చేశారని కొనియాడారు. గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను తాము కొనసాగిస్తామని చెప్పారు. గచ్చిబౌలిలోని హోటల్ వెస్టిన్లో బుధవారం సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో ‘విద్య, నైపుణ్యాభివృద్ధి – వ్యవస్థాపక అవకాశాలు’ అంశంపై నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. ఎన్నికలయ్యాక తాము రాజకీయాలు చేయడం లేదని, ప్రస్తుతం తాము అభివృద్ధిపైనే దృష్టిసారించామని అన్నారు.
రాష్ట్రంలో సిల్లింగ్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని.. సిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో చేరిన వారికి డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 64 ఐటీఐలను రూ.2వేల కోట్లతో సిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. పారిశ్రామిక ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు రాష్ట్రంలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గతంలో కొందరు ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదన్నారని.. ఇప్పుడది హైదరాబాద్కు లైఫ్లైన్గా మారిందని అన్నారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ ప్రభుత్వ విధానమని వెల్లడించారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని.. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని చెప్పారు. రాష్ర్టాభివృద్ధికి అందరి సహకారం అవసరమని. రాష్ట్రంలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి ముందుకెళతామని అన్నారు.