CM KCR | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ జనగణన చేపట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశా రు. బీసీ జన గణన చేపట్టడానికి కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నదని ప్రశ్నించారు. గురువారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పార్టీ ప్రతినిధుల సభలో సీఎం ప్రసంగించారు. గణన మత విద్వేషాలతో కాలయాపన చేస్తూ పకకు పెడుతున్నారని కేంద్రంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బీఆర్ అంబేద్కర్ దార్శనికతతోనే సాధ్యమైందని సీఎం చెప్పా రు. సచివాలయానికి కూడా ఆయన పేరు పెట్టుకుని అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా ముందుకు పోతున్నామని పేర్కొన్నారు.
దళితబంధు పథకానికి పెడుతున్న ఖర్చు సమాజ సంపదను పెంచే సామాజిక పెట్టుబడిగా మారుతుందని వివరించారు. ప్రభుత్వం పంచుతున్న డబ్బు గ్రామాల్లో తిరిగి సమాజానికి చేరుతుందని, దీన్నే ‘స్పిన్ ఆఫ్ ఎకానమీ’ అంటారని తెలిపారు. ఎన్ని కష్టాలొచ్చినా దళితబంధు పథకం కొనసాగుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల మీద దళితబంధు ఒత్తిడి పెంచుతున్నదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఫండ్ గురువారం నాటికి రూ.1,250 కోట్లకు చేరిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో రూ.767 కోట్లను డిపాజిట్ చేశామని, తద్వారా నెలకు రూ.7 కోట్ల వడ్డీ వస్తున్నదని, దీంతో పార్టీని నడుప డం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణా లు, ప్రచారం, మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేస్తున్నామని వివరించారు.
నూతన సచివాలయ ప్రారంభానికి రండి
ఈ నెల 30న ప్రారంభించుకునే నూతన సచివాలయానికి ప్రజాప్రతినిధులు, అధికారు లు మధ్యాహ్నం 12.45 కల్లా చేరుకోవాలని సీ ఎం సూచించారు. ఆ రోజు మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 వరకు మంత్రులు వారి చాంబర్స్లో ఆసీనులు కావాలని ఆదేశించారు.
ముఖ్య కార్యక్రమాలు