కేసీఆర్: కాళేశ్వరం డిజైన్ నేను చేయలేదు. ఇంజినీర్లు చేశారు. నేనే డిజైన్ చేశాననడం కాంగ్రెస్ వాళ్ల వాళ్ల మూర్ఖత్వానికి పరాకాష్ట. అది వాళ్ల విజ్ఞతకే వదిలేయాలి. నేను ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ను కాదు. అలాంటప్పుడు నేనెలా డిజైన్ చేస్తాను. రాజకీయ నాయకులం స్ట్రాటజిస్టులమే తప్ప డిజైన్లు చేసేవాళ్లం కాదు. వైఎస్సార్ప్రాణహిత చేవెళ్లను మొదలుపెట్టారు. దీని కెపాసిటీ కేవలం 14 టీఎంసీలు. ఒక పంపు పోస్తే మరో పంపు నడవాలి. కరెంట్ పోతే నడవదు. అంటే వాళ్లకు తెలంగాణకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేదు. కాబట్టి 14 టీఎంసీలు కాదు. దీన్ని మొత్తం రీడిజైన్ చేయాలని ఇంజినీర్లకు చెప్పా. ఇది కేసీఆర్ స్ట్రాటజీ. వాళ్లు తమ్మిడిహట్టి నుంచి తీసుకుంటామన్నారు. ఇదోక పెద్ద కుట్ర. తమ్మిడిహట్టి నుంచి కింద ఉన్నటువంటి 100-150 టీఎంసీలు ధవళేశ్వరం వెళ్లాలి. అక్కడ తెలంగాణను ముట్టుకోనివ్వరు. కాబట్టి మా ఇంజినీర్లతో చెప్పి సర్వే చేయించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ వాటర్ కమిషన్ పరిధిలోని వ్యాప్కోస్ను పిలిపించాము.
వ్యాప్కోస్ వాళ్లే పూర్తిగా సర్వే చేశారు. ఇంకా పూర్తి స్థాయిలో రావాలంటే రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకొని సర్వే చేయించాం. ఇందుకు సంబంధించి లారీల కొద్దీ ఫైల్స్ ఉన్నాయి. వీటిని ఎవరైనా చూసుకోవచ్చు. ‘మీరు తీసుకోవాలనుకుంటున్న నీళ్ల మొత్తాన్ని తమ్మిడిహెట్టి వద్ద తీసుకోలేరు’ అని సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చాయి. ఇక నీళ్లు ఎక్కడ తీసుకోవాలంటే ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత తీసుకోవాలి. అదే మేడిగడ్డ. అక్కడ బరాజ్ నిర్మించినం. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరిపై చిన్న ఆనకట్ట కూడా కట్టలేదు. డైరెక్ట్గా ఎస్సారెస్పీ నుంచి ధవళేశ్వరం. ఇక్కడ చుక్క నీళ్లు కూడా ఆగవు. పక్కన గోదావరి నీళ్లు పోతుంటాయి కానీ దేవాదులకు నీళ్లురావు. ఇదీ పరిస్థితి. మరి నీళ్లు ఎలా తీసుకోవాలి. రైతులు నష్టపోకుండా తక్కువ ముంపుతో వరద సమయంలో పైకి తీసుకెళ్లి స్టోర్ చేసుకోవాలి. ఇందుకోసం మూడు బ్యారేజీలు పూర్తి చేయాలి. ఎల్లంపల్లి తర్వాత మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక్సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్. ఈ క్రమంలో ఒక్కో స్టేజీలో లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందుతున్నాయి. తెలంగాణ రాకముందు, కాళేశ్వరం లేక ముందు శ్రీరాం సాగర్ ప్రాజెక్టే పూర్తిగా ఎండిపోయింది. అప్పుడు మేం అనుకున్నది.. అవసరమైతే శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరుకు కూడా కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించాలని. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుతో 40 లక్షల ఎకరాలకు ఢోకా లేదు. ప్రాణహితకు ఉన్నటువంటి గొప్పతనం. దేశం మొత్తం కరువు ఏర్పడిన పరిస్థితుల్లోనూ 465 టీఎంసీల నీళ్లు వచ్చాయి. అంటే నీళ్లకు ఢోకా లేదు. అక్కడి నుంచి నీళ్లు తీసుకోవచ్చు.
జవాబు: అది కోపం కాదు. ఒకరకమైన అజ్ఞాన తిమిరం. తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ర్టాన్ని ఆగం చేయాలని, తెలంగాణను ఆంద్రాలో కలపాలని అనుకున్నారు. అందుకు జరిగిన ప్రయత్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ. అందుకు ఓటుకు నోటు అనే విషప్రయోగం జరిగింది. అందులో స్టీఫెన్సన్ అనే ఎమ్మెల్యేను కొనాలని రూ.50 లక్షలు పంచుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడిన దోషి అతను. ఇప్పుడా కేసు సుప్రీంలో ఉంది. అప్పుడు పట్టుబడ్డాడు కాబట్టే.. అతనికి నాపై కోపం. ప్రత్యేకతంగా, వ్యక్తిగతంగా ఏమీ లేదు.
జవాబు: మేమూ వాటిని వదిలేద్దామనే అనుకుంటున్నాం. వీటికి వేసే టెండర్లు చాలా పారదర్శకంగా ఉంటాయి. ఎల్ఎండ్టీకి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. మేడిగడ్డ కట్టింది ఎల్ఎండ్టీ. రెండోది కట్టింది ఆఫ్కాన్స్. ఇంకొకటి నవయుగ. ఎల్అండ్టీ కంపెనీ వాళ్లు రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. అయినా వీళ్లు ఒప్పుకోవడం లేదు. మా హయాంలో 18 పంటలకు ఒక్క పంట ఎండకుండా బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చాం.
జవాబు: కొడంగల్కు నేను కొత్త ప్రాజెక్టు కడతా అని కొత్త దుకాణం పెట్టిండు. జూరాల ప్రాజెక్టుపై ఒత్తిడి పెరిగుతుంది. దాని సామర్థ్యమే 17 టీఎంసీలు. దాని లైవ్ కేపాసిటీ 11 టీఎంసీలు. అందులో యూజ్ఫుల్ వాటర్ 6 టీఎంసీ. దానిమీద భీమా లిఫ్ట్, నెట్టంపాడు, గట్టు లిఫ్టు ఉన్నాయి. వీటికితోడు మళ్లీ ఓ లిఫ్టు పెడతామంటే ఎలా? జూరాలలో స్టోరేజ్ కెపాసిటీ లేదు. అందుకే పాలమూరు ఎతి ్తపోతల పథకం పాయింట్ను శ్రీశైలంలో పెట్టినం. అక్కడ 200 టీఎంసీ కెపాసిటీ ఉంది. కేసీఆర్ ఆనవాళ్లు కాబట్టి పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టారా? ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు. దీనిపై ప్రజలతో ఉద్యమాలు చేయిస్తాం.
కేసీఆర్: ఎవరూ చెప్పలే. ఎవరూ ఖాళీ చేయమనలే. పగుళ్లు చూపిన తర్వాత 50-60 టీఎంసీల నీళ్లు వృథాగా వదిలిపెట్టారు. నీళ్లు వదిలిపెట్టాలని ఎవరూ చెప్పలె. వీళ్ల మూర్ఖత్వానికి నీళ్లును వదిలేశారు.
జవాబు: ఎప్పుడు చూసినా కేసీఆర్ ఆనవాళ్లన్నీ తీసేస్తా అంటుండు. సాధ్యమైతదా? నువ్ కూర్చుంటున్న సెక్రటేరియట్ ఎవరు నిర్మించింది? మీ ఎమ్మెల్యేల క్వార్టర్లు ఎవరు నిర్మించారు? యాదాద్రి దేవాలయం, పాలమూరు, సీతమ్మ సాగర్, సమ్మక్క బ్యారేజీ, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎవరు నిర్మించారు? వాటిని కూల్చేస్తవా? కేసీఆర్ 33 కొత్త జిల్లాలు పెట్టిండు తీసేస్తవా? కొత్త మండలాలు తీసేస్తావా? తండాలను గ్రామ పంచాయతీలను చేసిండు తీసేస్తవా? అట్లయితే తెలంగాణనే తీసేయ్యాలి. ‘ఒకరి ఆనవాళ్లు తీసేయడమంటే మూర్ఖత్వానికి పరాకాష్ట. కేసీఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. చరిత్రను సృష్టించిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ తెచ్చిన వాడు కేసీఆర్.