CM KCR | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణ అమలు, బ్యాంకులకు రుణాల ఎగవేత, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో కుంభకోణంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘనత వహించినటువంటి బీజేపీ సర్కారులో.. 33 అఫెండర్స్ హావ్ ఫ్లెడ్ అవే.. ఇదో కొత్త ఫీచర్ అన్నట్లు ఇది. మోదీ ప్రభుత్వంలో భారతదేశం సాధించిన ప్రగతి ఏంటంటే.. బ్యాంకు ముంచిన ప్రతి ఒక్కడు మంచిగ లండన్లో పిక్నిక్ చేయొచ్చు. 33 మంది సీబీఐ కేసులు పెట్టిన తర్వాత వేరే దేశాలకు పోరిపోయారు.. మంచిగ పిక్నిక్లు చేసుకుంటున్నరు. ఇవి కఠోరమైన వాస్తవాలు కావా? ఇవన్నీ పార్లమెంట్కు చెప్పిందే వాళ్లే. గత డిసెంబర్లో సెషన్లో పార్లమెంట్కు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు.. ఇవీ కేసీఆర్ లెక్కలు కావు. వీళ్లంతా చాలా మంది మోదీ దోస్తులే.. చాలా మంది గుజరాతీలే. ఏమనాలి దీన్ని. ఇది మీ గొప్పతం కాదా? మీ గవర్నమెంట్ ప్రతిభ కాదా?.. మీ దేశభక్తి ఇది తార్కాణం కాదా? దీన్ని ఏమనుకోవాలి అంటూ ప్రశ్నించారు.
కఠోరమైన వాస్తవాలు ఉంటే మీ ఇష్టమైన ట్రోలింగ్ చేసి.. ఓ దిక్కుమాలిన క్షుద్ర సోషల్ మీడియా పెట్టి.. ఎవర్ని పడితే వాళ్లను ఎంత మాటలైనా అంటం.. ఇదా పద్ధతి? అందుకే నేను చెబుతున్నా బీజేపీ మస్ట్ గో ఫ్రం దిస్ కంట్రీ. బీజేపీ గవర్నమెంట్ షుడ్ సెంట్ బ్యాక్.. ఎందుకు పంపించాలని ఉరికే అంటలేం అంటూ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ.. లలిత్ మోదీ, మోహుల్ చోక్సీ పేర్లను ప్రస్తావిస్తూ.. ఇదీ మీ ఘనత కాదా? అని ప్రశ్నించారు. దీనిపై మాట్లాడాలి.. ఎవరైనా దమ్మున్న మొగోడు మాట్లాడితే. ఇవిన్ని ఇడిచిపెట్టి నన్ను జైలులో వేస్తం అంటున్నరని.. నన్ను జైలులో ఎందుకు వేస్తేరు..? నాకు జాలి అనిపిస్తది.. దమ్ముంటే వేయాలి కదా?. జైలులో వేస్తాం అంటే ఈడ తోకగాడు భయపడుతడు. దొంగలకు భయం, అవినీతి సంపాదన చేసిన వారికి భయం మాకెందుకు భయం.
మమ్మల్ని వేసేది కాదు.. మిమ్మల్ని వేసేది పక్కా. బీజేపీ చిట్టా పుంకాను పుంకాలుగా బయటకు వస్తున్నది.. మొత్తం బద్దలు కొడుతం. రఫేల్ డీల్ అని.. రాహుల్ గాంధీ మాట్లాడిండు.. ఆయనను గోల్మాల్ తిప్పిన్రు. దీనిపై క్లీన్చీట్ తీసుకున్నామన్నరు.. నిన్న ఇవాళ అసలు విషయం బయటపడుతున్నది.. దీనిపై మేము సుప్రీం కోర్టులో కేసు వేస్తాం. ప్రజాకోర్టులో రఫేల్ డీల్ దొంగతనం బయటపెడుతాం. రఫేల్ డీల్లో మోదీ గవర్నమెంట్ వేలకోట్లు దిగమింగింది. ఇండియా రఫేల్ విమానాలు 36 జెట్స్ను 9.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాం. నిన్న ఇండోనేషియా 42 రఫేల్ జెట్లను 8 బిలియన్ డాలర్లకే కొన్నది. ఇందులో ఎవరు దొంగ. రఫేల్ విమానాలు తెలంగాణ కొనలేదు కదా? తమిళనాడు కొనలేదు కదా? ఈ కుంభకోణం బయటపడాలి.. ఎవడు జైలుకు పోవాల్నో వాడు పోవాలే. 33 మంది బ్యాంకులు ముంచి పారిపోయింది నిజమే. దీని పాపత్ములు ఎవరు.. దీనిపై దేశంలో చర్చ పెట్టాలి దేశంలో. పార్లమెంట్, ఢిల్లీలో. దీనిపై పార్లమెంట్లో చర్చ పెడుతాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల పట్ల అసహన వైఖరి, ఓడిపోతే ఓటమిని అంగీకరించం, ఒప్పుకోం. గోమాల్ తిప్పుతం.. పరేషాన్ చేస్తం. ఈడీ, సీబీఐ పెడుతం.. ఆగమాగం చేస్తం మందిని. అప్రజాస్వామికమైనటువంటి, ప్రజానిర్ణయాలను వ్యతిరేకించేటటువంటి, గౌరవించలేని కనీస సంస్కారం లేని ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. గతంలో వాజ్పేయి నాయకత్వంలో ఉన్నప్పుడు నమ్ముదురు. ఇప్పుడు సిద్ధాంతం గంగలో కలిపిన్రు. భారతదేశం సాక్షిగా, అందరి సాక్షిగా ఎన్నికల్లో గెలువకున్నా సిగ్గులేని ఒకటే పార్టీ బీజేపీ దేశంలో. మేం గెలువమ్ కానీ.. పరిపాలిస్తం.. మాకు సిగ్గులేదు ఎగ్గు లేదు.
మమ్మల్ని ఎవర్ని ఏమనద్దు.. మనందరం చూశాం.. కర్నాటకలో వీళ్లు గెలువలే కానీ పరిపాలిస్తున్నరు.. మధ్యప్రదేశ్లో గెలువలే కానీ పరిపాలిస్తున్నరు. గోవాలో గెలువలో పరిపాలించారు నిన్నటి దాకా. మణిపూర్లో గెలువలే పరిపాలిస్తున్నరు. మహారాష్ట్రలో గెలువలే.. మబ్బుల మూడుగొట్టంగా దొంగ ప్రమాణస్వీకారం చేశాయించారు.. తెల్లారే సరికి ఎదురుతంటే ఎల్లెలుకల వడి సిగ్గుమానం తీసుకున్నరు. ఇదంతా జరిగిన కదా? మహారాష్ట్రలో ఘోరంగా బీజేపీ పరువు పోలేదా? మహారాష్ట్రలో బీజేపీ ఆడిన నాటకం మీద రేపు చర్చ పెడుతామా? ఇది మంచి పద్ధతేనా? ఓటమిని అంగీకరించే సహనం ఉండాలి రాజకీయాల్లో. అన్నీ గెలువం.. కొన్ని సార్లు ఓడిపోతమ్.. రాజకీయం, ఎన్నికలు అన్న తర్వాత అక్కడున్న పరిస్థితులనబట్టి కొన్ని గెలుస్తం.. కొన్ని ఓడిపోతం.
గెలిచినంత మాత్రాన గర్వం ఎందుకు? ఓడినంత మాత్రాన అసహనం ఎందుకు? ఈ అడ్డదారులెందుకు? భారతదేశాన్ని నడిపించే పద్ధతి ఇదేనా? ఈ పద్ధతిలోనేనా ఈ దేశం బాగుపడేది? అన్ని రంగాలు నిర్వీర్యమైనయ్. సబ్సిడీలు కట్ చేస్తున్నరు. పేదల నోరు కొడుతున్నరు.. మళ్లీ బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు గొడ్డలి భుజాన పెట్టుకొని తిరుగుతున్నది. యూపీ ఎన్నికల్లో ఓటు డబ్బాలో పడ్డ తెల్లారి నుంచే పెట్రోల్ రేట్లు పెంచుతరు.. ఇలా టోటల్లీ అన్ డెమొక్రటిక్ పాలసీ.. ఆఫ్ ది ఎన్డీఏ గవర్నమెంట్. లెట్ ది బై మోదీ’ అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు.