ఖలీల్వాడి, జూలై 21: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీ హబ్ కేవలం ఉద్యోగ కల్పనే కాదు.. ఉద్యోగాల సృష్టికీ దోహదపడుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఐటీ హబ్లో ఉద్యోగాల భర్తీ కోసం నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్మేళా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సాఫ్ట్వేర్ అభివృద్ధికి ఐటీ హబ్ కేంద్ర బిందువు అవుతందని, త్వరలో రెండోదశ ఐటీ హబ్ కూడాప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇండస్ట్రియల్, ఆటో పార్క్ అభివృద్ధికీ కృషి చేస్తున్నామని వెల్లడించారు. యువత రాజకీయాల సంగతి కన్నా ముందు ఉద్యోగాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ మేళాలో 745 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని వివరించారు. టాస్క్ ఆధ్వర్యంలో మరో 1,000 మందికి ఐటీ, ఇతర రంగాల్లో శిక్షణ అందిస్తామని తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా మాట్లాడుతూ జాబ్మేళాలో ఉద్యోగం దక్కని యువత నిరుత్సాహ పడవద్దని, అందరికీ ఉద్యోగావకాశాలు వచ్చేంతవరకూ జాబ్మేళాలు నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. మొత్తం 13,600 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 13,000 మంది హాజరయ్యారు. 13 స్టాళ్ల ద్వారా 30 కంపెనీలు ఇంటర్వూలు నిర్వహించాయి. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ బిగాల మహేశ్ గుప్తా పాల్గొన్నారు.