హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్పై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ ప్రగతి భవన్కు వచ్చిన సందర్భంగా కేటీఆర్తో సమావేశమైనట్లు కుమారస్వామి ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలతో పాటు జాతీయ రాజకీయాలపై కీలకంగా చర్చించామని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో గొప్ప దృక్పథం కలిగిన, సమర్థవంతమైన నాయకుడు కేటీఆర్ అని కుమారస్వామి పేర్కొన్నారు. కేటీఆర్తో జరిగిన చర్చ చాలా అర్థవంతంగా జరిగిందన్నారు. కేటీఆర్ ఇచ్చిన ఆతిథ్యం, ఆయన చూపిన అభిమానానికి తాను ఉప్పొంగిపోయానని తెలిపారు.
Had a meaningful discussion with @KTRTRS Honorable Minister of Telangana for Municipal Administration, Urban Development, Industries, Commerce, Information Technology and Communication in Hyderabad. He is a stable leader with a great vision for development. pic.twitter.com/F47ENrsj8K
— H D Kumaraswamy (@hd_kumaraswamy) September 11, 2022