వ్యవసాయ, అటవీ అభివృద్ధిపై పద్మశ్రీ గ్రహీత తిమ్మక్క ప్రశంసలు
సీఎంను కలిసిన పర్యావరణవేత్త.. ఘనంగా సన్మానించిన కేసీఆర్
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందని పద్మశ్రీ పురస్కార గ్రహీత తిమ్మక్క ప్రశంసించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. వ్యవసాయం, అటవీ రంగాల్లో అభివృద్ధి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణవేత్త, 110 సంవత్సరాల సాలుమరద తిమ్మక బుధవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తిమ్మక్కను స్వయంగా సమీక్ష సమావేశానికి తీసుకువెళ్లి సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. అందరి సమక్షంలో ఆమెను ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మొకలు కావాలంటే తాను అందజేస్తానని తిమ్మక సీఎంకు స్వయంగా తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం తిమ్మక పడుతున్న తపన సమావేశంలో పాల్గొన్నవారిలో స్ఫూర్తిని నింపింది.
మొక్కలు నాటడం భవిష్యత్ తరాలను బతికించే మార్గం
‘ఆకుపచ్చని వీలునామా’ పుస్తకావిష్కరణలో సీఎం కేసీఆర్
మొక్కలు నాటడం ఒక కార్యక్రమం కాదు.. అది మనల్ని, మన భవిష్యత్ తరాలను బతికించుకునే మార్గమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా పచ్చదనం పెంపొందించే దిశగా, అడవుల సంరక్షణ, మొకల పెంపకంపై తెలంగాణ ప్రభుత్వ కృషి, హరితహారం కార్యక్రమం, దాని స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి కార్యక్రమాల ద్వారా జరుగుతున్న పర్యావరణ కృషిపై సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో పలువురు రచయితలు రాసిన వ్యాసాల సంకలనం.. ‘ఆకుపచ్చని వీలునామా’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆవిషరించారు. తొలికాపీని సాలుమరద తిమ్మకకు అందజేశారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటాలన్న బాధ్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన తిమ్మకను మించిన దేశభక్తులు ఎవరూ లేరని కొనియాడారు. ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. మంచిపనిలో నిమగ్నమైతే, గొప్పగా జీవించవచ్చని, మంచి ఆరోగ్యంతో ఉంటారనటానికి తిమ్మక నిలువెత్తు నిదర్శనమని, అందరూ ఆమె బాటలో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్కుమార్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
వృక్షమాత తిమ్మక్క
వృక్షమాతగా వినుతికెక్కిన తిమ్మక బీబీసీ ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల జాబితాలో ఒకరుగా నిలిచారు. 25 సంవత్సరాల వరకు పిల్లలు కలగకపోవడంతో మొకల్నే పిల్లలుగా భావించి, పచ్చదనం, పర్యావరణం కోసం ఆమె పనిచేస్తున్నారు. తిమ్మక అందించిన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సతరించింది.