హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ ప్రచారంలో నిమగ్నమయ్యారు. హుజూరాబాద్ పట్టణంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు.. వాడ వాడలా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిద్దామని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మేయర్ వివరించారు.