కరీంనగర్ కమాన్చౌరస్తా, మే 12: సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి ఫలితాల్లో కరీంనగర్ అల్ఫోర్స్ సత్తా చాటింది. అల్ఫోర్స్ చైర్మన్ వీ నరేందర్రెడ్డి కొత్తపల్లిలోని ఈ టెక్నో స్కూల్ ఆవరణలో విజేతలను శుక్రవారం అభినందించారు. టెన్త్ ఫలితాల్లో జే వామిక 495 మారులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించినట్టు చైర్మన్ నరేందర్రెడ్డి తెలిపారు.
ఎన్ అనిరుద్సాయి 492, బీ శ్రీహిత 487, ఏ శివాశ్రిత 487తోపాటు మరో 73 మంది 450కి పైగా మారులు సాధించారని పేర్కొన్నారు. 12వ తరగతిలో పీ వేదవిష్ణు 486, డీ అశ్వితరెడ్డి 484, షికారి చందన 478, ఆర్ సుహాసిత 473, నిషాంత్ పర్వల్ 471తోపాటు 30పైగా విద్యార్థులు 400కుపైగా మారులు సాధించారని వివరించారు.