Green India Challenge | రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బంజారాహిల్స్లో కరణ్ అర్జున్ చిత్ర యూనిట్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మూవీ డైరెక్టర్ మోహన్ శ్రీవట్స , హీరో అభిమన్యు, నిఖిల్ కుమార్, నటి శైఫా, ఆకుల బాలకృష్ణ, రవి మేకల, ప్రవీణ్ పురోహిత్, అరుణ్ మాధవరం పాల్గొన్నారు.
దర్శకుడు మోహన్ శ్రీవట్స, నటి శైఫా మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో పచ్చదనం పెరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఒక మొక్కను నాటితో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన వాళ్లం అవుతామని అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు సంతోష్ కుమార్కు ధన్యవాదములు తెలిపారు.