Kanti Velugu Phase 2 : రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ ఏర్పాట్లు చూస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లు, డీజీపీ అంజనీ కుమార్తో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వీ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మొహంతి, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ కూడా పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నకంటి వెలగు రెండో విడత కార్యక్రమం జనవరి 18న మొదలు కానుంది. మంత్ఉరి హారీశ్ రావు ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కంటి పరీక్షలకు సంబంధించిన పరికరాలు, కళ్లద్దాలు, మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలని మంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షలు చేయించుకోవాలి అనుకునేవాళ్లు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. మొత్తం 16,533 కేంద్రాల్లో కంటి పరీక్షలు చేయనున్నారు.