హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కంటి వెలుగు పరీక్షలు కోటి మార్క్కు అడుగు దూరంలో నిలిచాయి. మంగళవారం నాటికి 49 రోజుల్లో కంటి పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య.. 99.81 లక్షలుగా నమోదైంది. బుధవారం సెలవు. దీంతో గురువారం కంటి వెలుగు కార్యక్రమం 50 రోజుల్లో కోటి మార్క్ను అందుకోనున్నది.
సీఎం కేసీఆర్ సార్ సల్లగుండాలె
నాలుగైదు ఏండ్ల నుంచి ఎడమ కన్ను కనిపిస్త లేదు. సీఎం కేసీఆర్ సార్ తెచ్చిన కంటి వెలుగుతోని మా అసొంటి పేదలకు మంచి అయితున్నది. కంటి వెలుగులో చూపిచుకుంటే ఎడమ కన్ను ఆపరేషన్ చేయ్యాలన్నరు. డాక్టర్లు సిద్దిపేట సర్కార్ దవాఖానకు పంపిస్తే ఆపరేషన్ చేసిండ్రు. గిప్పుడు నాకు ఎడమ కన్ను మంచిగ కనవడుతున్నది. సీఎం కేసీఆర్ సార్ దయతోనే పైస కర్సులేకుండా ఆపరేషన్ అయింది.
– నర్మాల మల్లవ్వ, మిరుదొడ్డి మండలం, సిద్దిపేట జిల్లా