హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలోని సగం గ్రామాలు, 60 శాతం పట్టణ వార్డుల్లో శిబిరాలు పూర్తయ్యాయి. నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జనవరి 18న రెండో విడత కంటివెలుగును ప్రారంభించారు. మరుసటి రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు మొదలయ్యాయి.