హిమాయత్నగర్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, గ్రేటర్ ప్రధానకార్యదర్శి ఎం నర్సింహ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్కోడ్లను రద్దుచేయాలని డిమాండ్చేస్తూ శుక్రవారం హిమాయత్నగర్లోని ఎస్ఎన్ రెడ్డి భవన్ వద్ద లేబర్ కోడ్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కేంద్రం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా సవరిస్తున్నదని ఆరోపించారు. నాలుగు లేబర్కోడ్లు అమలైతే కొత్త బానిస వ్యవస్థ అమలులోకి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గ్రేటర్ అధ్యక్షుడు కమతం యాదగిరి, నాయకులు బీ కిషన్, లక్ష్మీబాయి, కే జ్యోతి, రమేశ్, ఉమర్ఖాన్, లతీఫ్, రాజేశ్, నవీన్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.