నిజామాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరు వరుస హత్యల కేసులో కామారెడ్డి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఆస్తి కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ గ్రామానికి చెందిన మేడిద ప్రశాంత్, ఆయన తల్లి వడ్డెమ్మ, మైనర్ అయిన తమ్ముడు, దాస్నగర్ గ్రామానికి చెందిన బానోతు విష్ణు, బానోతు వంశీని అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ తెలిపారు. కామారెడ్డిలో మంగళవారం విలేకరుల సమావేశంలో నలుగురు నిందితులను ప్రవేశపెట్టారు.
ఆర్థిక లావాదేవీలపై తలెత్తిన వివాదాలతో పాటు ప్రసాద్ ఆస్తిపై కన్నేసిన ప్రశాంత్ ఈ దారుణాలకు ఒడిగట్టినటు తెలిపారు. నవంబర్ 29న తొలి హత్య చేసిన నిందితులు డిసెంబర్ 13న ఆరో హత్య చేసినట్టుగా ఎస్పీ పేర్కొన్నారు. ప్రసాద్ తల్లి సుశీలను చంపే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డారని చెప్పారు. డిసెంబర్ 14న వెలుగు చూసిన హత్య కేసును ఛేదిస్తుం డగా నిందితుల జాడను పాల్వంచ వద్ద గుర్తిం చి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. హత్య కు గురైన ఆరుగురిలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని, ప్రసాద్ మృతదేహాన్ని మాక్లూర్ మండలం మదన్పల్లి అటవీ ప్రాం తంలో గుర్తించినట్టు వెల్లడించారు. ప్రసాద్ భార్యను చంపి బాసర వద్ద గోదావరిలో పడేశారని ఎస్పీ చెప్పారు. హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు సింధూశర్మ మాటల్లో..
మాక్లూర్కు చెందిన పూనే ప్రసాద్ (36) 2018లో అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని మోసం చేయగా, ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రసాద్పై సెక్షన్ 354డి, ఐపీసీ 306 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అప్పటికే అతడు దుబాయ్ వెళ్లగా, ఈ కేసు పెండింగ్లో ఉంది. 2022 అక్టోబర్లో స్వగ్రామానికి వచ్చిన ప్రసాద్ను పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపించగా బెయిల్పై బయటకు వచ్చాడు. దుబాయ్లో ఉన్నప్పుడే మేడిద ప్రశాంత్కు.. ప్రసాద్ 3.5 లక్ష లు అప్పు ఇచ్చాడు. జైలు నుంచి తిరిగొచ్చాక ప్రసాద్ కుటుంబానికి మాక్లూర్లో నివసించే పరిస్థితి లేకపోవడంతో కామారెడ్డి జిల్లా పా ల్వంచకు మకాం మార్చారు. ఈ క్రమంలో భారీగా అప్పులు కావడంతో తానిచ్చిన డ బ్బును తిరిగి చెల్లించాలంటూ ప్రశాంత్(25) పై ప్రసాద్ ఒత్తిడి తెచ్చాడు.
మరోవైపు, మాక్లూర్లో 25లక్షల విలువ చేసే రెండు ఇం డ్లు, స్థలాన్ని కుదువ పెట్టే ప్రయత్నం చేయగా సఫలీకృతం కాలేదు. ప్రశాంత్ను సంప్రదించగా తన పేరిట ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసిస్తే లోన్ ఇప్పిస్తానని చెప్పడంతో అది నమ్మిన ప్రసాద్ రిజిస్ట్రేషన్ చే యించాడు. తీసుకున్న అప్పు, ఇండ్ల పేరిట ఇస్తానన్న లోన్ సంగతి ఏమిటని ప్రశ్నించగా ప్రశాంత్ తప్పించుకుని తిరగడం మొదలు పెట్టాడు. మాక్లూర్ వదిలి వేరే చోట నివాసం ఉంటున్న ప్రసాద్ను, ఆయన కుటుంబీకులను చంపేస్తే ఆస్తులు తనకే చెందుతాయని ప్రశాంత్ భావించాడు. మాక్లూర్ శివారులోని దాస్నగర్ తండాకు చెందిన బానోతు విష్ణు(19), బానోతు వంశీ (19)తో 60 వేల ఒప్పందంతో ఆరుగురిని హత్య చేశాడు. వీరితో ప్రశాంత్ తమ్ముడు (మైనర్) సైతం చేతులు కలిపాడు.
నవంబర్ 29న మాక్లూర్కు వచ్చిన ప్రసాద్ నేరుగా ప్రశాంత్ ఇంటికెళ్లి ఎలాగైనా తన డబ్బులిచ్చేయాలని ఒత్తిడి చేశాడు. ఇదే అదనుగా భావించిన ప్రశాంత్.. బానోతు విష్ణు, వంశీతో సంప్రదింపులు జరిపాడు. నిజామాబాద్లో ఓ వ్యక్తి వద్ద కారును కిరాయికి తీసుకుకొచ్చి మద్యం సేవిద్దామంటూ ప్రసాద్తో కలిసి మాక్లూర్ మండలం మదన్పల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. మద్యం మత్తులోకి జారుకున్న ప్రసాద్ తలపై కట్టెలు, రాళ్లతో మోది చంపేసి అక్కడే చెట్ల పొదల్లో పడేశారు.
అర్ధరాత్రి మాక్లూర్కు వచ్చి పార, గడ్డపారలను తీసుకుకొచ్చి అడవిలోనే ప్రసాద్ మృతదేహాన్ని పూడ్చేశారు. ప్రసాద్ కనిపించడం లేదని కుటుంబీకులు ఎవరైనా పోలీసులను సంప్రదిస్తారని భావించి డిసెంబర్ 1న పాల్వంచకు ప్రశాంత్ ఒక్కడే వెళ్లా డు. గతంలో యువతి ఆత్మహత్య కేసు విషయంపై ప్రసాద్ కోసం పోలీసులు తిరుగుతున్నారని ఆయన భార్య శాన్విక(29), చెల్లెలు శ్రావణి(23)లను భయపెట్టి నిజామాబాద్కు తీసుకొచ్చాడు. భర్త దగ్గరికి పోదామని చెప్పి శాన్వికను బాసర బ్రిడ్జి వైపు తీసుకెళ్లి విష్ణు, వంశీలతో కలిసి గొంతు నులిమి చంపేసి గోదావరి నదిలో పడేశారు. అన్నా వదినల దగ్గరికి వెళ్దామని మాయమాటలు చెప్పి శ్రావణిని కారులో ఎక్కించుకుని మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం శివారులో 44వ జాతీయ రహదారి పక్కన గొంతు బిగించి చంపేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు.
ప్రసాద్ తల్లి సుశీల, అతని పిల్లలు ఛైత్రిక (8), ఛైత్రిక్(8), ఇంకో చెల్లెలు స్వప్న (26)ను భయభ్రాంతులకు గురి చేసి నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గల అన్నపూర్ణ లాడ్జిలో ఉంచారు. వీరికి తోడుగా ప్ర శాంత్ తన తల్లి వడ్డమ్మను వీరితో పాటే ఉం చాడు. ప్రసాద్ తన పిల్లలను చూడాలని అం టున్నారని చెప్పి లాడ్జిలో ఉన్న ఛైత్రిక, ఛైత్రిక్లను డిసెంబర్ 4న తన తమ్ముడి(మైనర్)ను వెంటేసుకుని తీసుకెళ్లాడు. కారులో సోన్ బ్రిడ్జి వైపు వెళ్లిన నిందితులు గొంతు నులిమి పిల్లలను చంపి వంతెన కింద కాలువలో పడేశారు. భార్య, పిల్లలతో ప్రసాద్ ఒకే చోట క్షేమంగా ఉన్నారని ప్రసాద్ తల్లి సుశీల, మరో సోదరి స్వప్న (దివ్యాంగురాలు)ను నమ్మబలికారు. డిసెంబర్ 13న స్వప్నను కారులో ఎక్కించుకుని గాంధారి ఎక్స్ రోడ్డు సమీపంలోని భూంపల్లి శివారులో గొంతుకు తాడు బిగించి చంపేసి పెట్రోల్ పోసి కాల్చి వేశారు. లాడ్జిలో అందరినీ పోగొట్టుకుని మిగిలిన ప్రసాద్ తల్లి సుశీలను సైతం హత్య చేయాలని భావించిన సమయంలో ఆమె తప్పించుకుంది. నిందితుల నుంచి కారు, బైక్, భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, రూ.30 వేల నగదు, 5 సెల్ఫోన్లు, తాడు, 2 పెట్రోల్ బాటిళ్లు, బంగారు పుస్తెల తాడును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు.
మాక్లూర్, డిసెంబర్ 19: ఆస్తి కోసం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని కిరాతకంగా హతమార్చిన నిందితుడు ప్రశాంత్ ఇంటిని ముట్టడించేందుకు మాక్లూర్ గ్రామస్తులు మంగళవారం యత్నించారు. స్థానిక సర్పంచ్ అశోక్రావును ఘెరావ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికులను అడ్డుకోగా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.